కీర్తన 125
యాత్రకీర్తన. 
 
1 యెహోవాపై నమ్మకము ఉంచేవారు  
కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.   
2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు,  
ఇప్పుడు ఎల్లప్పుడు  
యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.   
   
 
3 నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద  
దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు,  
లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి  
తమ చేతులను ఉపయోగిస్తారు.   
   
 
4 యెహోవా, మంచివారికి  
యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.   
5 అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని  
దుష్టులతో పాటు బహిష్కరిస్తారు.  
   
 
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.